Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ' శవపేటిక నమూనాతో ఆర్కే నగర్‌లో పన్నీర్ వర్గం... ఛీ ఛీ...

ఇంకా నయం... జయలలిత మమ్మీ(సమాధిలోని శవం)ని తీసుకొచ్చి ప్రచారం చేయలేదు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం మరింత దరిద్రంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన నాయకులు ఇళ్లల్లో ఎక్కడ సోదా చేస్తే అక్కడ రూ. 20

Advertiesment
Jayalalithaa Coffin
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:37 IST)
ఇంకా నయం... జయలలిత మమ్మీ(సమాధిలోని శవం)ని తీసుకొచ్చి ప్రచారం చేయలేదు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం మరింత దరిద్రంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన నాయకులు ఇళ్లల్లో ఎక్కడ సోదా చేస్తే అక్కడ రూ. 2000 నోట్ల కట్టలు కట్లపాముల్లా దర్శనమిస్తున్నాయి. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఇంట్లో లెక్క చెప్పుకోలేనంత డబ్బు ఐటీ దాడుల్లో వెలుగుచూశాయంటున్నారు.
 
అన్నాడీఎంకే చీలిక వర్గానికి సారధ్యం వహిస్తూ ఎన్నికల బరిలో నిలిచిన పన్నీర్ సెల్వం వర్గం విచిత్రమైన ఎన్నికల ప్రచారానికి తెరతీసింది. ఏకంగా జయలలిత శవపేటిక నమూనాను ఆర్కే నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా తిప్పుతూ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. దీనిపై జనం.. ఛీ... థూ... ఓట్ల కోసం మరీ ఇంత దారుణమా... అని మండిపడుతున్నారు. దీనితో ఆ శవపేటికను ప్రస్తుతానికి పక్కన పెట్టారు. 
 
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన పరిస్థితి అటు పన్నీర్, ఇటు శశికళ వర్గాలది. దీనితో ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో కోట్లలో డబ్బు, కోట్ల లీటర్ల మద్యం ఏరులై పారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలు జరగాల్సిన తేదీ ఏప్రిల్ 12ను వాయిదా వేసే అవకాశం వుందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాలో దారుణం : చెల్లిని 140 సార్లు కత్తితో పొడిచి.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కోసి....