Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ అంత్యక్రియల్లో జేబుదొంగల చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అంత్యక్రియల్లో జేబుదొంగలు తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శించారు. ఫలితంగా అనేక మంది తమ వస్తువులను పోగొట్టుకున్నారు.

అమ్మ అంత్యక్రియల్లో జేబుదొంగల చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు
, గురువారం, 8 డిశెంబరు 2016 (09:30 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అంత్యక్రియల్లో జేబుదొంగలు తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శించారు. ఫలితంగా అనేక మంది తమ వస్తువులను పోగొట్టుకున్నారు. ఈ జేబుదొంగలు జేబుల్లోని పర్సులను నొక్కేస్తూ... ప్రజలకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇలాంటివారిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. 
 
సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరిగిన విషయం తెల్సిందే. తమ నాయకురాలికి తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం విషాదంలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన సురేష్, దినేష్‌లతో పాటు.. మరికొందరు దొంగలు పలువురి నుంచి సెల్ ఫోన్లు, నగదును దోచుకున్నారు. 
 
జయలలిత పార్థీవదేహం ఉంచిన రాజాజీ హాలు నుంచి మెరీనా బీచ్ వరకు ఈ దొంగలు పలు చోరీలు చేశారు. చోరీలు చేస్తూ తోడు దొంగలు ప్రజలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో వారిని పోలీసులకు అప్పగించారు. దొంగల నుంచి రూ.30 వేల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని వేలూరు జిల్లా గుడియాత్తం వాసులుగా గుర్తించారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని యజమానులకు అప్పగిస్తామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయను కొనియాడిన విదేశీ మీడియా.. ‘ఓ గ‌దిలో మ‌ర‌ణం.. ఆ ప‌క్క‌గ‌దిలోనే వార‌స‌త్వ గొడ‌వ’ అనే వాక్యాలు...?