Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత ఆభరణాలు : 21 కేజీల బంగారం.. వజ్రాలు... 500 వైన్ గ్లాస్‌లు ఎవరికి సొంతం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం.

Advertiesment
జయలలిత ఆభరణాలు : 21 కేజీల బంగారం.. వజ్రాలు... 500 వైన్ గ్లాస్‌లు ఎవరికి సొంతం?
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:20 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసు విచారణ ఇప్పటికీ సాగుతోంది. అయితే, ఈ కేసులో ప్రధాన ముద్దాయి జయలలిత కావడం, ఆమె ఇపుడు చనిపోవడంతో ఈ కేసు ఇంతటితో ముగిసే అవకాశం ఉంది. 
 
అయితే, ఆమెకు సొంతమైన చీరలు, ఖరీదైన చెప్పుల జతలు వంటివి ఇప్పటికీ కర్ణాటక కోర్టుల కస్టడీలో ఉన్నాయి. దీంతో ఇవన్నీ ఇప్పుడు ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న తలెత్తుతోంది. త్వరలోనే సుప్రీంకోర్టు దీనిపై తీర్పు వెలువరించి ఆ ఆస్తులను రిలీజ్ చేస్తుందని, జయ స్మారకార్థం ఏర్పాటు చేసే మ్యూజియంలో వాటిని ప్రదర్శన కోసం ఉంచే అవకాశాలుంటాయని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అంటున్నారు. 
 
వాస్తవానికి 1996లో ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రస్తుతం కర్ణాటక పోలీసుల సంరక్షణలో ఉన్నాయి. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న 10,500 చీరలు, 750 చెప్పుల జతలు, 500 వైన్ గ్లాసులతో పాటు.. 3.5 కోట్ల రూపాయలు విలువచేసే 21.28 కేజీల స్వర్ణాభరణాలు, 1.250 కేజీల వెండి వస్తువులు, 2 కోట్ల రూపాయలు విలువచేసే వజ్రాలు, వెండి కత్తి వంటివి ఉన్నట్టు సమాచారం. 
 
బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు మొదటి అంతస్థులోని ఒక గదిలో భద్రపరిచారు. వీటికి నలుగురు పోలీసులు షిఫ్టుల వారిగా కాపలా ఉన్నారు. ఈ కేసు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదలీ కావడంతో 2002లో ఈ వస్తువులన్నింటినీ ఐటి అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఆ గదిలో ఏమున్నాయనేది తమకు తెయదని సాయుధ రిజర్వ్ పోలీసులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్లన్న, అచ్చెన్నా నమస్కాం.. జగన్ :: ఏమయ్యా జగన్ మేం కనిపించలేదా... కేఈ కృష్ణమూర్తి