Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరులో అమ్మ ఆత్మ తిరుగుతుందట.. కారు ఓనర్‌ను భయపెట్టిందా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ చెన్నై నుంచి చిత్తూరుకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అమ్మ ఆత్మ అపోలో ఆస్పత్రిలో తిరుగుతోందని కొన్నాళ్లు, అంత్యక్రియల సమయంలో మెరీనా తీరంలో కనిపించిందని కొన్నాళ్ల

చిత్తూరులో అమ్మ ఆత్మ తిరుగుతుందట.. కారు ఓనర్‌ను భయపెట్టిందా?
, బుధవారం, 15 మార్చి 2017 (11:28 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ చెన్నై నుంచి చిత్తూరుకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అమ్మ ఆత్మ అపోలో ఆస్పత్రిలో తిరుగుతోందని కొన్నాళ్లు, అంత్యక్రియల సమయంలో మెరీనా తీరంలో కనిపించిందని కొన్నాళ్లు జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.

ఇటీవల అమ్మ పేరుతో రిజిస్టర్ అయిన కారు చిత్తూరులోని నిర్జన ప్రాంతంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరులో అమ్మ ఆత్మ తిరుగుతుందని సమాచారం. అమ్మకారును చిత్తూరు జిల్లాలో వదిలివెళ్లిపోయారు. దాన్ని ఎవరో కావాలనే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 
 
చిత్తూరు జిల్లా కెవిబి పురం మండలంలోని ఆరోం గ్రామం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో అమ్మ కారు కనిపించింది. టిఎన్‌07 - వి1948 నెంబరు ఉన్న ఈ కారును మొదటగా జయలలిత పేరుతో రిజిస్టర్ అయ్యిందని.. ఆపై ఇద్దరు చేతులు మారిందని తెలిసింది.

స్థానికులు మాత్రం అమ్మ ఆత్మ పీడించడం వల్ల కారును చిత్తూరులో వదిలేసి వెళ్ళిపోయారు. కారు తనది కావడంతోనే అమ్మ ఆత్మ కారు ఓనర్‌ను భయపెట్టి వుంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అమ్మ ఆత్మను పోయెస్ గార్డెన్ నుంచి మాంత్రిక శక్తులతో శశికళ అండ్ టీమ్ తరిమేసిందని.. అందుకే అమ్మ ఆత్మ ఏపీలో ఎంటరైందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కే.నగర్ ఉప ఎన్నికలు : అన్నాడీఎంకే టీటీవీ దినకరన్ పోటీ