Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఇంటికొచ్చాడు.. ముగ్గురిని?

జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి

భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఇంటికొచ్చాడు.. ముగ్గురిని?
, శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:23 IST)
జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీప వాసి సురేందర్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాను అతని భార్యతో కలిసి కాశ్మీర్‌లో నివాసం ఉంటున్నారు. 
 
వారికి ఇద్దరు పిల్లలు. జమ్మూలోని దులాస్టిలోని నేనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసే సురేందర్.. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. అయితే అదే సమయానికి పక్కింటి వ్యక్తి  రాజేష్ బయట వుండటాన్ని చూశాడు. 
 
అంతే రాజేష్‌ను కాల్చి చంపాడు. ఆపై భార్యను కూడా కాల్చేశాడు. శబ్ధం విని బయటికి వచ్చిన రాజేష్ సతీమణిని కూడా హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. సీఐఎస్ఎఫ్ అధికారులు, సురేందర్‌ను సస్పెండ్ చేశారు. ఇక రెండు జంటలకు చెందిన పిల్లల బాధ్యతలను తాము చూసుకుంటామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలను పశువుల్లా అమ్మేస్తున్నారు... ఎక్కడ?