Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు సైనికులు మృతి

ladakh army
, బుధవారం, 11 జనవరి 2023 (11:51 IST)
జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నార్త్ కాశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. 
 
ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారి కోసం గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు దొరికాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో విడత జగనన్న చేదోడు నిధులు విడుదల