Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత నిఘా వ్యవస్థలో సరికొత్త అస్త్రం

భారత నిఘా వ్యవస్థలో సరికొత్త అస్త్రం
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:44 IST)
భారత్‌ నిఘా విభాగంలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ‘ఇమిశాట్‌’, దీన్ని ముద్దుగా ‘రాడార్‌ కిల్లర్‌’ అని కూడా పిలుస్తారు. ఈరోజు ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారతదేశం ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. దీనిని ప్రాజెక్ట్ కౌటిల్య కింద అభివృద్ధి చేశారు. ఇందులో అత్యంత పదునైన ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది.
 
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.432 కోట్లు వెచ్చించారు. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఇది రాడార్‌ నెట్‌వర్క్‌పై నిఘా ఉంచుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించి శత్రుదేశాల భౌగోళిక సమాచారాన్ని తెలుసుకునే వారు కానీ ఇమిశాట్‌ రాకతో 24 గంటలూ నిఘావేసే అవకాశం దక్కుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థుల కోసం ఇస్రోలో సమ్మర్ హాలిడే కోర్సు...