Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీఎస్‌ఎల్‌వీ -సీ51 కౌంట్‌డౌన్ ప్రారంభం..

పీఎస్‌ఎల్‌వీ -సీ51 కౌంట్‌డౌన్ ప్రారంభం..
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:54 IST)
సరికొత్త అధ్యాయానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. 
 
ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌)లో రాకెట్‌ కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఉదయం 8.54 గంటలకు ప్రారంభించారు. సుమారు 25.30 గంటల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 10.24గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.
 
అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను రాకెట్‌ మోసుకెళ్లనుంది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ నేతృత్వంలో నింగిలోకి తొలి వాణిజ్య ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌ కక్షలో ప్రవేశపెట్టనుంది. 
 
బ్రెజీలియన్‌ శాటిలైట్‌ అమెజానియా-1 భూపర్యవేక్షణకు కీలకమైంది. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌-1 నానో కాంటాక్ట్‌-2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ధావన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటవీశాఖ సిబ్బందికి అష్టకష్టాలు.. ఆడపులి, మగపులి కోసం వెతుకులాట