Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అంబానీ, ఆకాష్.. రూ.1.5 కోట్లు..?

Mukesh Ambani
, శనివారం, 18 ఫిబ్రవరి 2023 (23:46 IST)
Mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ.. మహాశివరాత్రి సందర్భంగా గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. 
 
ఆలయంలో ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలు శివుడికి అభిషేకం చేసి పూజలు చేశారు. అలాగే దర్శనానంతరం సోమనాథ్ ఆలయ ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు. 
 
పరమ శివునికి అంకితభావంతో, అంబానీ కుటుంబం వారి సంప్రదాయాలకు కట్టుబడి అన్ని హిందూ పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. 
webdunia
Mukesh Ambani
 
ఆలయ ట్రస్టు తరపున ఆయనకు ట్రస్టు అధ్యక్షుడు పి.కె. లాహిరి, కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ వీరికి స్వాగతం పలికారు. ఆలయ పూజారి గౌరవ సూచకంగా చందనం పూశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తారకరత్న మరణవార్తతో ఇండస్ట్రీ షాక్.. హైదరాబాదుకు తరలింపు చర్యలు