Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూదంలో భార్యను పణంగా పెట్టాడు.. దుశ్శాసనులకు అప్పగించాడు.. ఇద్దరు అత్యాచారం

జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ఆదర్శంగా తీసుకుని.. తన భార్యను పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపై భార్యను దుశ్శాసనులకు అప్పగించిన ఘటన మధ్యప్రద

జూదంలో భార్యను పణంగా పెట్టాడు.. దుశ్శాసనులకు అప్పగించాడు.. ఇద్దరు అత్యాచారం
, గురువారం, 13 జులై 2017 (10:41 IST)
జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ఆదర్శంగా తీసుకుని.. తన భార్యను పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపై భార్యను దుశ్శాసనులకు అప్పగించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్‌లో బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది. 
 
ఆమె చెప్పిన వివరాల ప్రకారం భర్త జూదానికి బానిసయ్యాడు. జూదానికి డబ్బుల్లేక తన భార్యను పందెం కాశాడు. అందులో ఓటమి చెందడంతో తనను పరాయి మగాళ్లకు అప్పగించాడని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో భర్తకు దూరమైనా.. వేధింపులు మాత్రం ఆగట్లేదు. తన భర్తతో పాటు కీచకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసుపై ఓ నిర్ధారణకు వచ్చాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం