Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవులు - ఆంబోతులు ఒక్కటయ్యాయి.. మంగళవాయిద్యాలు.. వేదమంత్రాల మధ్య...

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవుల

Advertiesment
Rajasthan's Bharatpur
, సోమవారం, 7 నవంబరు 2016 (14:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవులు, ఆంబోతులు ఒక్కటయ్యాయి. ఎంతో వైభవంగా సాగిన ఈ ఆవుల వివాహాలకు అతిధులుగా షిల్లాంగ్, మేఘాలయ, ముంబై, ఢిల్లీ, చంఢీఘడ్ ప్రాంతాలనుంచే కాకుండా చుట్టుపక్కల పదిగ్రామాల ప్రజలు తరలివచ్చారు. 
 
అతిథుల కోసం ప్రత్యేకంగా 200 కాటేజీలను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ గోవుల వివాహ మహోత్సవానికి వచ్చిన వారినుంచి అందిన రూ.25 లక్షల విరాళాలతో ఆవుల షెల్టర్లను అభివృద్ధి చేస్తామని రాజేంద్రదాస్ అనే నిర్వాహకుడు చెప్పారు. ఈ పెళ్లి కోసం 40 ఎద్దులను ప్రత్యేకంగా పాత్ మేద గోశాల నుంచి రప్పించామని మరో నిర్వాహకుడు గోపేష్ చెప్పారు. హిందూమతంలో ఆవులకున్న విశిష్టతను గుర్తించి దేశవాళీ ఆవులు గర్భం దాల్చేందుకు వీలుగా ఎద్దులను తీసుకువచ్చి వివాహతంతు జరిపించామని నిర్వాహకులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణా హోం మంత్రిగా డీకే అరుణ‌? కేసీఆర్ సిగ్నల్ ఇచ్చారా...?