బంగారు చేతులు కలిగిన గణేష్ విగ్రహానికి రూ.300 కోట్ల బీమా... ఎక్కడ?
గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా గణేశుని విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, ముంబైలో వాడ్లాలో ప్రతిష్టించిన విగ్రహానికి ఏకంగా రూ.300 క
గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా గణేశుని విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, ముంబైలో వాడ్లాలో ప్రతిష్టించిన విగ్రహానికి ఏకంగా రూ.300 కోట్ల మేరకు బీమా చేయించారు. దీన్ని జీఎస్బీ సేవా మండల్ చేయించింది. ఈ వినాయకుడి ప్రత్యేక ఏంటంటే...
మొత్తం 11 అడుగులు ఎత్తువున్న ఈ విగ్రహ చేతులకు బంగారు తాపడం చేయించగా, విగ్రహానికి బంగారం, వెండి ఆభరణాలను వేశారు. పైగా, ముంబైలో ఈ యేడాది ప్రతిష్టించిన అతిపెద్ద విగ్రహాల్లో ఇదే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అలాగే, ముంబై శివారు ప్రాంతమైన లాల్బగ్చా ఏరియాలో ప్రతిష్టించిన విగ్రహానికి రూ.51 కోట్ల మేరకు బీమా చేయించడం గమనార్హం.