Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ.. వారణాసి నుంచి పోటీ చేస్తే?

priyanka gandhi
, సోమవారం, 14 ఆగస్టు 2023 (13:42 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి పార్లమెంటుకు వెళ్లేందుకు పూర్తి అర్హత ఉందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు. 
 
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్  వాద్రా ఢిల్లీలోని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..  'ప్రియాంక గాంధీ లోక్‌సభలో కచ్చితంగా ఉండాలి. అందుకు తగిన అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయి. పార్లమెంట్‌లో చాలా బాగా రాణిస్తారు. అక్కడ ఉండేందుకు ఆమె అర్హురాలని.. కాంగ్రెస్ పార్టీ ఆమెను అంగీకరించి మంచి ప్రణాళికలు రూపొందిస్తుందని ఆశిస్తున్నాను. ." అంటే వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వాలని రాబర్ట్ వాద్రా సూచనప్రాయంగా వెల్లడించారు. 
 
ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన పేరును బిజినెస్ మాగ్నెట్ గౌతమ్ అదానీతో ముడిపెట్టడంపై రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. 
 
ఇదిలా ఉంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.
 వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారు. 
 
వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీల పోరు బీజేపీకి కష్టమని రౌత్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంద్రాగస్టుకు అతిథులుగా 1800 మంది సామాన్యులు