Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి ఖర్చు రూ.1000.. టీ పార్టీతో సరిపెట్టిన జంట.. అతిథులకు కప్పు టీ ఇచ్చి?

పెద్ద నోట్ల రద్దుతో వివాహాలకు డబ్బుల కొరత ఏర్పడింది. వివాహానికి తరలివచ్చిన అతిధులకు కప్పు టీ ఇచ్చి ఆ దంపతులు ఒక్కటైన వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నాలమ్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది

పెళ్లి ఖర్చు రూ.1000.. టీ పార్టీతో సరిపెట్టిన జంట.. అతిథులకు కప్పు టీ ఇచ్చి?
, సోమవారం, 5 డిశెంబరు 2016 (12:28 IST)
పెద్ద నోట్ల రద్దుతో వివాహాలకు డబ్బుల కొరత ఏర్పడింది. వివాహానికి తరలివచ్చిన అతిధులకు కప్పు టీ ఇచ్చి ఆ దంపతులు ఒక్కటైన వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నాలమ్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివాహాన్ని ఆడంబరంగా చేయాలనుకున్నా పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కొరత వల్ల తమ ప్రయత్నాన్ని విరమించుకొని టీపార్టీతో వివాహం అయిందనిపించారు.
 
అనవసర ఖర్చులు లేకుండా నిరాడంబరంగా టీపార్టీతో జరిగిన పెళ్లిని అతిధులు సైతం మెచ్చుకున్నారు. పెద్ద నోట్ల పుణ్యమా అంటూ రత్నాలమ్ పట్టణానికి చెందిన కపిల్ రాథోడ్, అంతిమ్ బాలల వివాహాన్ని నిరాడంబరంగా అతిధులకు కప్పు టీ ఇచ్చి జరిపారు. ఈ వధూవరులిద్దరూ శనివారం రత్నాలమ్ కోర్టులో రిజిస్టరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆదివారం రామమందిరంలో అతిధులను ఆహ్వానించి వారికి టీ ఇచ్చారు. వివాహ వేడుకలో టీ తాగిన అతిధులు నూతన దంపతులను ఆశీర్వదించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలి: గిరిరాజ్