Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరదలిపై మోజుపడ్డాడు... భార్యను కాటికి పంపాడు.. ఎక్కడ?

వివాహేతర సంబంధాలు ఎంతటి ఘాతుకానికైనా పాల్పడేందుకు ప్రోత్సహిస్తాయి. తాజాగా కిరాతక భర్త ఒకడు తన మరదలిపై మోజుపడి కట్టుకున్న భార్యను కాటికి పంపించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బాగల్కోటె జిల్లా ముథోళ

మరదలిపై మోజుపడ్డాడు... భార్యను కాటికి పంపాడు.. ఎక్కడ?
, శనివారం, 18 ఫిబ్రవరి 2017 (09:35 IST)
వివాహేతర సంబంధాలు ఎంతటి ఘాతుకానికైనా పాల్పడేందుకు ప్రోత్సహిస్తాయి. తాజాగా కిరాతక భర్త ఒకడు తన మరదలిపై మోజుపడి కట్టుకున్న భార్యను కాటికి పంపించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బాగల్కోటె జిల్లా ముథోళ తాలూకా చిచఖండి అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చిచఖండి గ్రామానికి చెందిన రత్నమ్మ (25) అనే మహిళను చంద్రు కిలబనూరు (35) అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసకు మరదలు అయిన రత్నమ్మ చెల్లిపై చంద్రు మోజుపడ్డాడు. ఆమెను మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. ఇందుకోసం భార్యను పథకం ప్రకారం హత్యచేశాడు. ఈనెల 14న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి పాముకాటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించాడు. 
 
ఈ విషయమై స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో అదేరోజు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం జరపడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పోస్టుమార్టం నివేదికలో రత్నమ్మ గొంతునులమడంతోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈమేరకు భర్త చంద్రును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
 
మరదలిని పెళ్లి చేసుకోవాలని భార్యను చంపినట్లు అంగీకరించాడు. వెయ్యి రూపాయలు చెల్లించి పామును కొనుగోలు చేసిన విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారానికై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితకు ప్రాణహాని లేదు.. నాకు ఉంది.. శశికళ : చెన్నైకు మార్చాలంటూ పిటీషన్