Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుజరాత్ : పెళ్లి కాలేదని చెప్పి మోసం... భార్యపైనే భర్త కేసు

తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్ర

గుజరాత్ : పెళ్లి కాలేదని చెప్పి మోసం... భార్యపైనే భర్త కేసు
, సోమవారం, 31 అక్టోబరు 2016 (09:50 IST)
తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్రహ్మభట్ అనే 44  ఏళ్ల వ్యక్తి లేటు వయసులోమ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని ముంబైకు చెందిన అన్షు అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లి అయి రెండేళ్లు అయినా పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తన భార్య ముందుకు రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. తమ పెళ్లి రిజిస్ట్రేషనుకు రమ్మని భార్యను భర్త పట్టుపట్టగా ఆమె భయపడి తన తల్లిని పిలిచింది. 
 
ఆపై తల్లీ కూతురు మొదటి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే విన్న రవి భార్య చేసిన మోసం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్య అన్షు కాస్తా తన పుట్టినిల్లు అయిన ముంబైకు వెళ్లిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి భర్తను మోసగించిన భార్య గురించి దర్యాప్తు ఆరంభించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌ మరో మూడు నెలలు పొడగింపునకు కారణాలివే...