Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

207 కేజీల హై ప్యూరిటీ డ్రగ్స్ స్వాధీనం.. విలువ రూ.1476 కోట్లు

Advertiesment
drugs
, ఆదివారం, 2 అక్టోబరు 2022 (16:39 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోమారు భారీ మొత్తంలో డ్రగ్స్‌‍ పట్టబడ్డాయి. 207 కేజీల హై ప్యూరిటీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.1476 కోట్లుగా ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే, ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్న దిగుమతిదారుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. ఈ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సౌతాఫ్రికా నుంచి వచ్చినట్టు డీఆర్ఐ అధిగారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
నవీ ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ చేతులు మారుతున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో పక్కాగా నిఘా వేసిన అధికారులు... 198 కేజీల హై ప్యూటిరీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కేజీల హై ప్యూరిటీ కొకైన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్‌ను వాలెన్షియా రకం విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో ఉంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. 
 
కాగా, ఈ హై ప్యూరిటీ డ్రగ్స్ తీసుకున్నవారికి ఆ మత్తు 12 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు
 
ఈ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ కోసం, స్థానిక మాదకద్రవ్యాల నెట్ వర్క్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్