Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:20 IST)
పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్రంలో తృతీయ ప్రౌవృత్తిగా హిజ్రాలుగా గుర్తించిన పభుత్వం వారికి ఓటు హక్కు కల్పించి అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషన్‌లో కోరారు. 
 
ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్‌కే కౌల్‌, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాససం విచారణ జరిపింది. ఈ సమస్యపై పొరుగుదేశాల్లో అమలవుతున్న తీరును పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికను దాఖలు చేయాలని దేవప్రశాంతను నియమించిన న్యాయమూర్తులు తదుపరి విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?