Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెస్ట్ బెంగాల్‌లో దారుణం : తల లేని మొండెం... తంత్రాల నెపంతో బలిచ్చారా?

పశ్చిమ్‌ బంగాలోని ఉత్తర మిడ్నాపూర్‌లో దారుణం జరిగింది. ఆ ఊరిలో క్షుద్రపూజలు నిర్వహించిన దుండగులు.. ఇద్దరు మహిళలను బలిచ్చారు. మహిళల మొండెంను గుర్తించిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించా

వెస్ట్ బెంగాల్‌లో దారుణం : తల లేని మొండెం... తంత్రాల నెపంతో బలిచ్చారా?
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:45 IST)
పశ్చిమ్‌ బంగాలోని ఉత్తర మిడ్నాపూర్‌లో దారుణం జరిగింది. ఆ ఊరిలో క్షుద్రపూజలు నిర్వహించిన దుండగులు.. ఇద్దరు మహిళలను బలిచ్చారు. మహిళల మొండెంను గుర్తించిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంలో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మహిళల మొండెంతో పాటుగా నిమ్మకాయలు, కుంకుమ, పసులు, నువ్వులు, ఇనుప మేకులు పడి ఉన్నాయి. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే తమ్లక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ తమలపాకుల తోటలో గత శనివారం రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి తలలేని మృతదేహాన్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 2 గంటల తర్వాత నందిగ్రామ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవిలో పొదల వద్ద మరో మహిళ మృతదేహం కన్పించడంతో కలకలం రేగింది. ఆ మృతదేహానికీ తల లేకపోవడంతో ఈ రెండు హత్యలకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాగా ఓ మృతదేహం వద్ద కుంకుమ, అగర్‌బత్తీలు, పూలు తదితర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. దీంతో తంత్రాల నెపంతో వీరిని బలిచ్చి ఉంటారని అంటున్నారు. అయితే మృతదేహాలు దొరికిన చోటే వీరిని చంపేశారా.. లేదా మరోచోట చంపేసి ఇక్కడ పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మహిళ వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాట్నా రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలు.. పోర్న్ సైట్ల వీక్షణలో టాప్ ప్లేస్