Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై మహిళలకు సేఫ్ కాదు.. కారులో ఫాలో చేసి.. రాత్రి 2 గంటలకు తలుపుతట్టాడు.. (video)

దేశ వాణిజ్య నగరం ముంబైలో అర్థరాత్రి ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. బాధితురాలు తన ఫేస్‌బుక్ పేజ్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులపై స్పందించింది. వివరాల్లోకి వెళ్తే... ముంబైలో అదితి నాగ్ పాల్ అనే యువతి ఫ్

ముంబై మహిళలకు సేఫ్ కాదు.. కారులో ఫాలో చేసి.. రాత్రి 2 గంటలకు తలుపుతట్టాడు.. (video)
, బుధవారం, 9 ఆగస్టు 2017 (08:43 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైలో అర్థరాత్రి ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. బాధితురాలు తన ఫేస్‌బుక్ పేజ్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులపై స్పందించింది. వివరాల్లోకి వెళ్తే... ముంబైలో అదితి నాగ్ పాల్ అనే యువతి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. పదేళ్ల పాటు ఆమె ముంబైలో వుంటోంది. 
 
ఈ నేపథ్యంలో నాగ్ పాల్ తన స్నేహితురాలు, తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తుండగా, కారులో ఒక వ్యక్తి వెంబడించాడు. అంతేగాకుండా.. రాత్రి 2 గంటల ప్రాంతంలో వారి ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కూడా కొట్టాడు. అయితే డోర్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాను చూసి నెమ్మదిగా దూరం వెళ్లి తచ్చాడి వెనుదిరిగాడు. 
 
రాఖీ పండుగ రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాఖీ పండుగను జన్మలో మర్చిపోలేనని ఫేస్ బుక్ పేజీలో నాగ్ పాల్ తెలిపింది. ముంబై కూడా మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
సీసీ పుటేజ్‌తో ఆధారంతో నాగ్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేధింపులకు పాల్పడిన వ్యక్తి నితేశ్‌ కుమార్‌ శర్మ (36) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతనిని అరెస్టు చేసిన వీడియోను కూడా నాగ్ పాల్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో అమెరికా 'షాడో అధ్యక్షురాలు' పర్యటన... ఎవరు?