Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానాలో ఢీకొన్న రెండు బస్సులు - ఐదుగురు మృత్యువాత

హర్యానాలో ఢీకొన్న రెండు బస్సులు - ఐదుగురు మృత్యువాత
, సోమవారం, 27 డిశెంబరు 2021 (13:31 IST)
హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. హర్యా నుంచి ఢిల్లీ వైపు వెళుతున్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు అమిత వేగంతో వచ్చి ఢీకొట్టింది. 
 
దీంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం: కట్నం కోసం సామూహిక అత్యాచారం.. 45 రోజులు బంధించి..