Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...

దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...
, ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:57 IST)
దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
పానిపట్ జిల్లాకు చెందిన ఓ 17 యేళ్ళ యువతి దళిత యువకుడిని ప్రేమించి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. ఆ తర్వాతవారి ఆచూకీ తెలుసుకుని మాయమాటలతో నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు. తమ బిడ్డ ఈ పని చేయడంతో తమ కుటుంబ పరువు మంటగలిసిపోయిందనీ భావించి ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఆ యువతిని దారుణంగా అంతమొందించారు. 
 
తండ్రి, చిన్నాన్నలు కుటుంబ సభ్యుల సహకారంతో కుమార్తెకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేసి, మృతదేహాన్ని దహనం చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేలిపోతున్న ఐఫోన్ 8.. వినియోగదారుల గగ్గోలు!