Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

జ్ఞానవాపి కేసులో విచారణ మే 26కు వాయిదా

Advertiesment
Gnanavapi
, మంగళవారం, 24 మే 2022 (15:57 IST)
Gnanavapi
కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని... మసీదు సముదాయంలో పూజలు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 
 
వారణాసి కోర్టు నియమించిన సర్వే బృందం కూడా నివేదిక సమర్పించింది. ఇప్పటికే జ్ఞానవాపిలో శివలింగం బయటపడగా... రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
తాజాగా జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రేపటివరకు విచారణ కొనసాగించవద్దని వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను మే 26 మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. 
 
ఇకపోతే.. జ్ణానవాపి మసీదు గోడలపై ఉన్న శృంగేరీ దేవీతో పాటు ఇతర దేవతా మూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారించిన సివిల్ జడ్జి వీడియోగ్రఫీ సర్వేకి ఆదేశాలు ఇచ్చారు.
 
జ్ణానవాపి మసీదులో దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు అందులోనే వెల్లడైంది. మసీదులోని బావిలో శివలింగం ఉన్నట్లు వీడియోగ్రఫీ సర్వేలో గుర్తించారు. 
 
శివలింగం ఉన్న ప్రాంతాన్ని పరిరక్షించాలని ఆదేశం ఇచ్చిన సుప్రీం కోర్టు… అదే సమయంలో ముస్లింలకు నమాజుకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దొందటూ సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందర్నీ కలుపుకుంటూ పో... గన్నవరం టిక్కెట్ నీకే ఇస్తాం..