Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా నాన్నను చంపింది పాక్ కాదు యుద్ధం... గుర్, ట్రిపుల్ సెంచరీలు కొట్టింది నేను కాదు నా బ్యాట్... వీరూ

ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. శత్రుదేశం పాకిస్తాన్ పేరు చెబితే భారతీయులెవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నక్క వినయాలు పోతూనే దొంగచాటుగా దొంగ దెబ్బలు తీయడం దానికి అలవాటు. పాకిస్తాన్ దేశం సంగతి అలావుంచితే కార్గిల్ అమరవీరుడు మన్ దీప్ సింగ్ కుమార

మా నాన్నను చంపింది పాక్ కాదు యుద్ధం... గుర్, ట్రిపుల్ సెంచరీలు కొట్టింది నేను కాదు నా బ్యాట్... వీరూ
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (21:46 IST)
ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. శత్రుదేశం పాకిస్తాన్ పేరు చెబితే భారతీయులెవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నక్క వినయాలు పోతూనే దొంగచాటుగా దొంగ దెబ్బలు తీయడం దానికి అలవాటు. పాకిస్తాన్ దేశం సంగతి అలావుంచితే కార్గిల్ అమరవీరుడు మన్ దీప్ సింగ్ కుమార్తె గుర్ మెహర్ సింగ్ చేసిన ట్వీట్లు ఇపుడు దుమారం రేపుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని గుర్మెహర్ ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసింది. ఇందులో తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని యుద్ధ చంపిందంటూ ఓ ప్లకార్డు పట్టుకుని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్టును చూసిన వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టయిల్లో మరో పోస్ట్ చేశాడు. తన రికార్డుల్లో ఉన్న రెండు ట్రిపుల్ సెంచరీలు తను చేయలేదనీ, తన బ్యాట్ చేసిందంటూ ప్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోజును పోస్ట్ చేశారు. దీనితో ట్వీట్ల దుమారం చెలరేగింది. 
 
ఒకవైపు ఏబీవీపి మరోవైపు గుర్ మెహర్ మద్దతుదారులతో ట్విట్టర్ మోతక్కెతోంది. మరోవైపు విషయంలోకి రాజకీయ నాయకులు దూకేశారు. మొత్తమ్మీద గుర్ ట్వీట్, ఆమెకు రిటార్డ్ ఇచ్చేట్లు చేసిన సెహ్వాగ్ ట్వీట్ రచ్చరచ్చగా మారాయి. మరి ఇవి ఎంతవరకూ వెళతాయో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశీ ఉద్యోగుల మెడపై కత్తి - తొలగించేందుకు కారణాలు వెతుకుతున్న యుఎస్ కంపెనీలు