Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్‌లో అమానవీయం : బాలికకు గుండు కొట్టించి ఊరేగింపు.. ఎందుకు?

గుజరాత్‌లో అమానవీయం : బాలికకు గుండు కొట్టించి ఊరేగింపు.. ఎందుకు?
, ఆదివారం, 14 నవంబరు 2021 (11:46 IST)
గుజరాత్ రాష్ట్రంలో అమానవీయ సంఘటన ఒకటి జరిగింది. తాను ప్రేమించిన యువకుడితో లేచి పోయేందుకు ప్రయత్నించిన ఓ మైనర్ బాలికను పట్టుకుని గుండు కొట్టించి గ్రామంలో ఊరేగించారు. కేవలం గుండు మాత్రమే కాకుండా ముఖానికి నల్లటి రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో శుక్రవారం జరుగగా పోలీసులు శనివారం వివరాలను వెల్లడించారు. 
 
బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. 
 
ఈ ఘటనకు సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేశామని, 22 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరోవైపు తమ బాలికను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలిక ప్రియుడిపైనా కేసు నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ప్రశాంతంగా సాగుతున్న పంచాయితీ పోరు