Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైకు ఎక్కేందుకు నిరాకరించిన దళిత యువతిని చంపేశారు... ఎక్కడ?

Advertiesment
Gujarat
, శుక్రవారం, 10 మే 2019 (11:15 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బైకు ఎక్కేందుకు నిరాకరించిన ఓ దళిత యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా బావ్లా పట్టణంలో మరో రెండు వారాల్లో బాధిత యువతి మిట్టల్ జాదవ్ వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన స్నేహితులైన శ్రవణ్, ధన్‌రాజ్‌లతో కలిసి వచ్చిన కేతన్ వాఘేలా అనే యువకుడు యువతిని తన బైక్‌పై ఎక్కాల్సిందిగా కోరాడు. 
 
మిట్టల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేతన్ అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం కత్తి పట్టుకునే అక్కడి నుంచి పరుగులు తీశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి కాసేపటికే ప్రాణాలు విడిచింది. 
 
యువతి తండ్రి రమేశ్ జాదవ్ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్టోపస్‌ను ప్రాణాలతో వున్నప్పుడే తినాలకుంది.. కానీ చుక్కలు కనిపించాయ్ (Video)