Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవా సర్కారు అవినీతిలో కూరుకుంది.. ఎమ్మెల్యేలు డబ్బు లెక్కించుకుంటున్నారు... బీజేపీ నేత

Advertiesment
panduranga

ఠాగూర్

, శుక్రవారం, 7 మార్చి 2025 (09:47 IST)
ఆయనో బీజేపీ నేత. పేరు పాండురంగ మడైకర్. గోవాలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ చిన్నపని కోసం తాను సొంత పార్టీకి చెందిన మంత్రికి రూ.20 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంపై గోవా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. లంచం పుచ్చుకున్న మంత్రిపేరును బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. గోవాలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకునిపోయిందని, మంత్రులు డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బిజీగా ఉన్నారని పాండురంగ ఆరోపించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన ఏ ఒక్క నేత పేరును ప్రస్తావించలేదు. 
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మంగళవారం బీజేపీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. దీనికి హాజరైన పాండురంగ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు ఓ చిన్న పని కోసం మంత్రికి తాను స్వయంగా రూ.15 నుంచి రూ.20 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిపారు. 
 
మంత్రులందరూ డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బీజేపీ ఉన్నారు. గోవాలో ఏమి జరగడం లేదు అని ఆరోపించారు. దివంగత మనోహర్ పారికర్ క్యాబినెట్‌లో పాండురంగం మంత్రిగా పని చేశారు. నేను కూడా మంత్రిగా పని చేశాను. కాబట్టి మంత్రులు ఎలా పని చేస్తారో నాకు తెలుసు. ఒక చిన్న పని కోసం స్వయంగా నేనే రూ.15 నుంచి రూ.20 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బు తీసుకున్నా మని మాత్రం చేయలేదు. నా ఫైలు పెండింగ్‌‍లో పెట్టారు. నేను ఫోను చేస్తే నన్ను కలిసేందుకు కానీ, మా పని చేసిపెట్టడానికి కానీ నిరాకరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుఏఈలో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షలు అమలు