Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికను రేప్ చేసి.. వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతుల అరెస్ట్..

ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌ఘఢ్ ర

బాలికను రేప్ చేసి.. వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతుల అరెస్ట్..
, శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:35 IST)
ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల ఓ బాలిక ఇంట్లో అలిగి ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషనుకు వచ్చింది. బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అర్మాన్, హసీనా దంపతులు వారి ఇంటికి తీసుకెళ్లారు. 
 
బాలికపై ఆర్మాన్ అత్యాచారం చేసి, ఆమెను 70వేల రూపాయలకు ఫరీదాబాద్‌కు చెందిన పప్పు యాదవ్‌కు విక్రయించాడు. పప్పు యాదవ్ బాలికను తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పెళ్లి చేసుకున్నాడు. అయితే పప్పు యాదవ్ బారినుంచి తప్పించుకోవాలనుకుని నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు వచ్చిన బాలికను రిక్షా కార్మికులైన ముహమ్మద్ అఫ్రోజ్, మహమ్మద్ జాకీర్‌లు తీసుకువెళ్లి వారు కూడా సామూహిక అత్యాచారం చేశారు. 
 
బాలికను ఇద్దరు రిక్షాకార్మికులు బలవంతంగా తీసుకువెళుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాపాడి పోలీసులకు అప్పగించారు. ఆపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులును అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌పై బాంబుల వర్షం కురిపించి... కుల్‌భూషణ్‌ను తీసుకురండి : ప్రవీణ్ తొగాడియా