Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం: నలుగురి అరెస్ట్

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం: నలుగురి అరెస్ట్
, శనివారం, 9 అక్టోబరు 2021 (13:58 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డారు. బాలిక ప్రియుడు సహా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అనంతరం మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులూ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధిత యువతి, ఆకాశ్​ భండారీ అనే యవకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. 
 
అక్టోబర్​ 2 నుంచి 7 మధ్య ఆకాశ్​తో పాటు అతని స్నేహితులు సందీప్​, ఫిరోజ్ ఖాన్​, అజయ్​ సురంకర్ యువతిపై నాగ్​పుర్ నగర శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు : ఉండవల్లి షాకింగ్ కామెంట్స్