బెంగుళూరు కీచకపర్వం : నిందితులను గుర్తించిన కమ్మనహళ్లి బాధితురాలు
బెంగుళూరు సామూహిక లైంగిక వేధింపుల్లో కమ్మనహళ్లి బాధితురాలు తనను వేధించిన నిందితులను గుర్తించింది. ఇందుకోసం నిర్వహించిన పెరేడ్లో తనపై దౌర్జన్యానికి పాల్పడిన నలుగురిని ఆమె గుర్తించారు. ఈ నిందితులంతా కమ
బెంగుళూరు సామూహిక లైంగిక వేధింపుల్లో కమ్మనహళ్లి బాధితురాలు తనను వేధించిన నిందితులను గుర్తించింది. ఇందుకోసం నిర్వహించిన పెరేడ్లో తనపై దౌర్జన్యానికి పాల్పడిన నలుగురిని ఆమె గుర్తించారు. ఈ నిందితులంతా కమ్మనహళ్లి ప్రాంతానికి చెందినవారుగా తేలింది. నిందితులను అయ్యప్ప, లెనిన్ ఫ్యాట్రిక్, సోమశేఖర్, సుధీష్లుగా గుర్తించారు. మిగిలిన వ్యక్తులు తనకు తెలియదని- వారిని ఎన్నడూ చూడలేదని - పరిచయం లేదని స్పష్టం చేసింది.
నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఆటోలో ఇంటికి వచ్చినట్లు తెలిపారు. రహదారిపై దిగి ఇంటికి నడిచి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చుట్టుముట్టారని చెప్పారు. వారి నుంచి రక్షణ కోసం ప్రతిఘటిస్తూ కేకలు వేసినట్లు వివరించారు. ఓ యువకుడు దురుసుగా వ్యవహరించి లాక్కెళ్లి వాహనంపై కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడన్నారు.
తీవ్ర ప్రతిఘటనతో కేకలు వేశానని అదేసమయానికి అక్కడి ఓ ఇంటి దీపాలు వెలగడంతో దుండగులు నన్ను నెట్టేసి పరారైనట్లు ఆమె వివరించారని పోలీసు ఉన్నత వర్గాలు ధ్రువీకరించాయి. నలుగురు నిందితుల్ని న్యాయస్థానం ముందు హాజరు పరిచి ఈనెల పదో తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు.