Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బతుకుదెరువు కోసం వచ్చి లాడ్జిలో వ్యభిచారం... నలుగురి అరెస్టు

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డక

బతుకుదెరువు కోసం వచ్చి లాడ్జిలో వ్యభిచారం... నలుగురి అరెస్టు
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:25 IST)
హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డకు చెందిన నానావతి కళావతి అనే మహిళ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. 
 
దీంతో బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌ వచ్చింది. అక్కడ రైల్వే స్టేషన్‌ను అడ్డాగా చేసుకొని విటులను ఆకర్షిస్తూ సెవెన్‌హిల్స్‌ లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. ఇందుకోసం ఆమె లాడ్జీ యజమానిని వలలో వేసుకుంది. 
 
దీంతో ఆయన తన లాడ్జీలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రైడ్ చేసి... వ్యభిచారాన్ని ప్రోత్సహించి యజమానితోపాటు ముగ్గురిని అరెస్టు చేశారు.
 
అరెస్టు చేసిన వారిలో కళావతితోపాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమాని లఖాన్‌, మేనేజర్‌ ప్రకాశ్‌, అందులో పనిచేస్తున్న ఆర్‌.జగదీశ్‌ను కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎంగా ప్రమాణం చేశారు.. చిన్నమ్మ దర్శనం కోసం బెంగుళూరుకు...