Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంట హత్య కేసులో టూటూల ఆధారంగా నిందితుల గుర్తింపు!!

arrested
, శుక్రవారం, 20 అక్టోబరు 2023 (14:48 IST)
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇద్దరు యువతుల హత్య కేసులోని నిందితులను పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి చేతిపై ఉన్న టాటూ, మరో నిందితుడి చేతిలో ఉన్న పోలీసుల వైర్‌లెస్ సెట్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గత 2009 మార్చి 18న నగరంలో ఐటీ నిపుణురాలు జిగీశ ఘోష్ అనే యువతి హత్య జరిగింది. రెండు మూడు రోజుల తర్వాత ఫరీదాబాద్‌లోని సూరజ్ కుంద్ ప్రాంతంలో ఈమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఆమెను దోచుకొని హత్య చేశారు. జిగీశ డెబిట్ కార్డు ఉపయోగించి నిందితులు షాపింగ్ కూడా చేశారు. 
 
ఈ సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన విచారణ అధికారులు వారిలో ఒకరి చేతికి టాటూ (పచ్చబొట్టు), మరొకరి చేతిలో పోలీసుల వైర్లెస్ సెట్టు, తలపై టోపీ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ సాయంతో మరింత నిశిత పరిశీలన చేశారు. ఆ తర్వాత నిందితులు బల్జీతామాలిక్, రవికపూర్, అమిత శుక్లాలను అరెస్టు చేశారు. వీరిలో మాలిక్ చేతిపై అతడి పేరుతో టాటూ ఉండగా, రవికపూర్ వద్ద గతంలో పోలీసు అధికారి నుంచి లాక్కొన్న వైర్‌లెస్ సెట్టు ఉంది. 
 
వసంత్ విహార్‌లోని జిగీశ ఇంటి సమీపం నుంచి ఆమెను అపహరించి, ఆమె వద్ద ఉన్న వస్తువులు దోచుకున్నాక చంపి పడేసినట్లు నిందితులు ముగ్గురూ అంగీకరించారు. ఈ సందర్భంగా రవికపూర్ చెప్పిన మరో విషయం విని పోలీసులు విస్తుపోయారు. నెల్సన్ మండేలా మార్గ్‌లో మరో యువతిని తాము హత్య చేశామని, ఇందులో అజయ్ కుమార్, అజయ్ సేథి అనే మరో ఇద్దరి హస్తం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో 2008 సెప్టెంబరు 30న జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ హత్యకేసు గుట్టు కూడా రట్టయింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు లభించని తక్షణ తక్షణ ఊరట..