కేరళ తీరంలో సింగపూర్ జెండాతో ఉన్న కంటైనర్ కార్గో షిప్ అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. దీనితో భారత నావికాదళం నేతృత్వంలో సముద్రం మధ్యలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మందిని నావికాదళ నౌక INS సూరత్ రక్షించింది.
ఇంకా నలుగురు సిబ్బంది ఆచూకీ తెలియలేదని అధికారులు సోమవారం ధృవీకరించారు. రక్షించబడిన నావికులలో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ (NMPA), పనంబూరుకు తరలిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్లో మంటలు చెలరేగాయి. మంటలకు గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు.
ప్రమాద హెచ్చరిక అందిన తర్వాత భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ సమన్వయంతో స్పందించాయి. ఎన్ఎంపీఏ అధికారులు, వైద్య- పోర్ట్ అధికారులతో కలిసి, గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించడానికి అత్యవసర ఏర్పాట్లు చేశారు.
రక్షించబడిన సిబ్బంది మిశ్రమ జాతీయులకు చెందినవారు:
వీరిలో 8 మంది చైనా నుండి, నలుగురు తైవాన్ నుండి, మరో నలుగురు 4 మంది మయన్మార్ నుండి, ఇద్దరు ఇండోనేషియాకు చెందిన వారు. అయితే ఓడ యాజమాన్యం సరుకు వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. తప్పిపోయిన నలుగురు సిబ్బందిని కనుగొనడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అగ్నిప్రమాదం నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా పర్యావరణ ముప్పుల కోసం కోస్ట్ గార్డ్, భారత నావికాదళం కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఓడను సురక్షితంగా ఉంచి, రక్షించబడిన సిబ్బందిని విచారించిన తర్వాత తదుపరి దర్యాప్తు ప్రారంభించబడుతుందని పోర్ట్ వర్గాలు తెలిపాయి.