Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంటులో అగ్నిప్రమాదం

పార్లమెంటులో అగ్నిప్రమాదం
, బుధవారం, 1 డిశెంబరు 2021 (12:02 IST)
భారత పార్లమెంటులో అగ్నిప్రమాదం చెలరేగింది. పార్లమెంటులోని రూమ్ నెంబర్ 59లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే తాము అప్రమత్తమయ్యామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.  
 
సమాచారం అందుకున్న వెంటనే ఓ అగ్నిమాపక బృందం త్వరగా సంఘటనస్థలానికి చేరుకుంది. వీరు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఇంకా రాబోయే గంటల్లో అధికారిక వివరణ వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు క్రమంగా పురోగమిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమయ్యాయి, ఇది డిసెంబర్03న ముగుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో విద్యుత్ చార్జీల వాత ఖాయం, కసరత్తు చేస్తున్న అధికారులు