Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముస్లిం మహిళలు కూడా ఓట్లు వేశారు.. ప్రజల హృదయాలు గెలుచుకో!: యూపీ సీఎంకు తండ్రి సలహా

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించిన విషయంతెల్సిందే. మొత్తం 403 సీట్లకు బీజేపీ ఏకంగా 3

ముస్లిం మహిళలు కూడా ఓట్లు వేశారు.. ప్రజల హృదయాలు గెలుచుకో!: యూపీ సీఎంకు తండ్రి సలహా
, బుధవారం, 22 మార్చి 2017 (10:39 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించిన విషయంతెల్సిందే. మొత్తం 403 సీట్లకు బీజేపీ ఏకంగా 325 సీట్లలో విజయఢంకా మోగించింది. దీంతో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టారు. 
 
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తన బిడ్డకు యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఓ సలహా ఇచ్చారు. హిందూ ఓట్లతోనే మీరు (బీజేపీ) గెలవలేదనీ, ముస్లింలతోపాటు ప్రతి ఒక్కరూ ఓట్లు వేశారని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలని... ముస్లిం మహిళలు కూడా నీకు ఓటేశారని... అన్ని మతాలను గౌరవించాలని... అందరి హృదయాలను గెలుచుకోవాలని సలహా ఇచ్చారు. 
 
ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముస్లిం మహిళలు ఓటు వేయడానికి ప్రధాన కారణం ట్రిపుల్ తలాక్‌తో పాటు.. ఇతర సమస్యల నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందన్న భావన ఉందన్నారు. ఆ ఆశతోనే బీజేపీకి ఓటు వేశారని బిష్త్ తెలిపారు. అన్ని మతాలకు చెందిన ప్రజలను యోగి సమానంగా చూడాలని... రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించాలని ఆకాంక్షించారు. ప్రజల మనసులు గాయపడేలా యోగి వ్యాఖ్యలు చేయరాదని కోరారు. తన కుమారుడు ఎంతో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. హిందూ మత ప్రచారకర్తగా ఉన్న మచ్చను యోగి చెరిపేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు రెండాకుల గుర్తుపై ఈసీ నిర్ణయం.. శశికళ - పన్నీర్ వర్గాల్లో మొదలైన గుబులు