Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతి పైట లాగుతున్న ఫోటో... భాజపా కైలాష్ షేర్... ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో తెలుసుకోకుండా ఏదిబడితే అది నమ్మేసి దానికి రీట్వీట్లు చేస్తూ, కామెంట్లు పెడితే, అది కూడా బాధ్యత గల రాజకీయ పార్టీలకు చెందినవారైతే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. ప్రస్తు

యువతి పైట లాగుతున్న ఫోటో... భాజపా కైలాష్ షేర్... ఏం జరుగుతోంది?
, సోమవారం, 10 జులై 2017 (18:25 IST)
సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో తెలుసుకోకుండా ఏదిబడితే అది నమ్మేసి దానికి రీట్వీట్లు చేస్తూ, కామెంట్లు పెడితే, అది కూడా బాధ్యత గల రాజకీయ పార్టీలకు చెందినవారైతే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే... ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్‌ చేసిన కొందరు, మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్‌ పెట్టేశారు. ఇది అలాఅలా సర్క్యులేట్ అవుతూ రాగా అది కాస్తా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌ వర్గియా కంట పడింది. 
 
ఇంకేముందు అదే ఫోటోను ఆయన సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేసేశారు. ఐతే ఆ ఫోటో ఏదో సినిమాలోనిది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన పనికి సాక్షాత్తూ భాజపా ప్రధాన కార్యదర్శి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఫేస్ బుక్ కాదు.. ఫేక్ బుక్ పోస్టులు అంటూ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిరీష కుమార్తె దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు నేనే భరిస్తా: ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్