Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు. వన్యమృగాల వద్దకెళ్లి ప్రాణాలు క

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)
, శుక్రవారం, 24 నవంబరు 2017 (17:51 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు.

వన్యమృగాల వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న బాహుబలి 2 చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌‌ను లైవ్‌లో చేయాలనుకున్న కేరళ యువకుడిపై ఏనుగు తొండంతో దాడి చేసింది. 
 
అచ్చం బాహుబలి2 తరహాలో కేరళకు చెందిన ఓ యువకుడు ఏనుగు తొండంపై ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఏనుగుకు అరటిపండు అందించాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.

అయితే ఏనుగు ఒక్కసారిగా అతన్ని తొండంతో విసిరికొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి పడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి అతడి స్నేహితుడు కాపాడాడు.  తాజాగా సెల్ఫీ మీద‌ మోజుతో ఏనుగు వ‌ద్ద‌కు వెళ్లిన 40 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌లో గురువారం చోటుచేసుకుంది.
 
కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఓ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేస్తోన్న సాదిఖ్ అనే వ్య‌క్తి ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తోన్న స‌మ‌యంలో అటవీ ప్రాంతంలోని హైవేపై ఓ ఏనుగుని చూశాడు. సంతోషంతో దాని వ‌ద్ద‌కు వెళ్లి త‌న మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు ఒక్కసారిగా తొండంతో దాడి చేయ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోసాని అలా చెప్పడంతో టిఆర్ఎస్‌లోకి నటుడు సంపూర్ణేష్ బాబు