300 కోడిగుడ్లతో కూర వండేసిన తమిళ వ్యక్తి.. యూట్యూబ్లో వీడియోకు వ్యూస్ వెల్లువ (వీడియో)
పావుగంటలో కోడిగుడ్లతో ఏదైనా వంటకం చేయగలరా...? అబ్బే అంత సీన్ లేదు అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ తమిళ వ్యక్తి 300 కోడిగుడ్లలో 15 నిమిషాల్లో వంటకం రెడీ చేశాడు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ
పావుగంటలో కోడిగుడ్లతో ఏదైనా వంటకం చేయగలరా...? అబ్బే అంత సీన్ లేదు అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ తమిళ వ్యక్తి 300 కోడిగుడ్లలో 15 నిమిషాల్లో వంటకం రెడీ చేశాడు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ వ్యక్తి ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. మాతృభాషలో తాను చేసే వంటకాన్ని వివరిస్తూ నెట్టింట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.
అసలు విషయానికి వస్తే.. 300 కోడిగుడ్లలో ఈ వ్యక్తి సింపుల్గా కూర వండేశాడు. గ్యాస్ పొయ్యి గట్రా లేకుండా పూర్తి గ్రామీణ వాతావరణంలో ఇటుకల పొయ్యిమీద ఈ తమిళ వ్యక్తి వండిచూపించే వంటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 'విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ' అనే యూట్యూబ్ చానెల్లో నవంబర్ 4న తంబి అనే తమిళ వ్యక్తి వండిన 300 కోడిగుడ్ల కూరను ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా చూశారు. కళ్లతోనే కూరను రుచిచూసి సూపర్ అంటున్నారు.
2015లో ప్రారంభమైన 'విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ'లో స్థానిక వంటకాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఒక్క తమిళనాడేకాదు, థాయిలాండ్, బ్యాంకాక్ తదితన దేశాల్లోని గ్రామీణులు సైతం లోకల్ వంటకాలను ప్రపంచానికి రుచిచూపిస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్లో అనేక రకాల వంటకాలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటైన 300 కోడిగుడ్లతో కూర తమిళ తంబి ఎలా చేశాడో చూద్దాం..