Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేఖర్‌ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త నోట్లిచ్చా.. ఇంకేం అడగొద్దు... : పరస్మాల్ లోధా

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన ఇసుక కాంట్రాక్టర్, నల్లకుబేరుడు, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు జే.శేఖర్ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు అందజేసినట్టు కోల్‌కతాకు చెందిన హవాలా వ్యా

Advertiesment
Parasmal Lodha
, బుధవారం, 11 జనవరి 2017 (06:13 IST)
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన ఇసుక కాంట్రాక్టర్, నల్లకుబేరుడు, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు జే.శేఖర్ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు అందజేసినట్టు కోల్‌కతాకు చెందిన హవాలా వ్యాపారవేత్త పరస్మాల్ లోథా వెల్లడించాడు. అయితే, ఈ కొత్త కరెన్సీ నోట్లను ఎక్కడ నుంచి పొందాడో మాత్రం బహిర్గతం చేయలేదు. 
 
ఇటీవల శేఖర్‌ రెడ్డి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో భారీ మొత్తంలో నల్లధనంతో పాటు.. రూ.34 కోట్ల వరకు కొత్త కరెన్సీ నోట్ల రూపంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ కేసులో లోథాను కస్టడీకి తీసుకున్న సీబీఐ అతన్ని విచారిస్తున్న విషయం తెలిసిందే. 
 
కాగా, నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్‌ను రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి అనగానేమి? మొత్తం మోదీనే చేశాడంటున్న అమర్త్యసేన్