Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేరం రుజువైతే తక్షణం అనర్హత వేటు వేసేందుకు అభ్యంతరం లేదు : సుప్రీంకు చెప్పిన ఈసీ

ప్రజాప్రతినిధులు నేరాలకు పాల్పడి ముద్దాయిగా నిరూపితులైతే తక్షణం వారిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌కు భారత ఎన్నికల సంఘం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఎంపీలు, ఎంఎల్ఏలపై నేరం రుజువైతే, వెంటనే అనర్

Advertiesment
Eelection Commission
, మంగళవారం, 8 నవంబరు 2016 (11:36 IST)
ప్రజాప్రతినిధులు నేరాలకు పాల్పడి ముద్దాయిగా నిరూపితులైతే తక్షణం వారిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌కు భారత ఎన్నికల సంఘం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఎంపీలు, ఎంఎల్ఏలపై నేరం రుజువైతే, వెంటనే అనర్హత ఓటు వేసేందుకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. 
 
ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు నేరం రుజువైన తర్వాత కూడా, లోక్‌సభ లేదా రాజ్యసభ కార్యదర్శులు, అసెంబ్లీ కార్యదర్శులు డిస్ క్లారిఫికేషన్ నోటీసులు జారీ చేసి, ఆపై వేటు వేసేంత వరకూ తమ హోదాను కొనసాగిస్తున్నారని ఈసీ గుర్తు చేసింది. అధికారంలో వారి పార్టీయే ఉంటే, ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతోందని కూడా ప్రస్తావిస్తూ, నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయాలని, ఈ మేరకు సుప్రీం ఆదేశాలు వెలువరించాలని కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి... అమ్మాయిలపై నిషేధం విధించిన పుణె కాలేజ్