Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘రిస్క్’ ఉంటే ఆఫీసుకు రావొద్దు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూచన

‘రిస్క్’ ఉంటే ఆఫీసుకు రావొద్దు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూచన
, శుక్రవారం, 1 మే 2020 (16:55 IST)
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వెంటనే ఆరోగ్యసేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఆ యాప్లో సేఫ్ అనే స్టేటస్ చూపినప్పుడు మాత్రమే ఆఫీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

అన్ని డిపార్ట్ మెంట్లలోని అధికారులు, ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసులకు రావడానికి సంబంధించి పలు సూచనలతో ఓ ఆర్డ‌ర్ జారీ చేసింది.

‘‘ఆఫీసుకు వచ్చే ముందు ఆరోగ్య సేతు యాప్‌‌లో మీ స్టేటస్ ను తప్పనిసరిగా రివ్యూ చేయండి. యాప్లో సేఫ్ అని చూపించినా లేదా లో రిస్క్ అని చూపించినప్పుడు మాత్రమే ఆఫీసులకు రావాలి”అని అందులో స్పష్టం చేసింది.
 
ఒకవేళ బ్లూటూత్ ప్రాక్సామిటీ(పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్) ఆధారంగా యాప్లో స్టేటస్ ను మోడరేట్ లేదా హైరిస్క్ గా చూపినట్లయితే ఆ ఏరియాల్లో ఉన్న వారు ఆఫీసులకు రావొద్దని, 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని, మళ్లీ స్టేటస్ సేఫ్ లేదా లో రిస్కు వచ్చిన తర్వాతే బయటకు రావాలని పేర్కొంది.

తప్పనిసరిగా గైడ్ లైన్స్ ను పాటించాలని ఆదేశించింది. డిప్యూటీ సెక్రటరీ అంతకంటే పై స్థాయి అధికారులు డ్యూటీలకు హాజరవుతున్నారు. మిగతా సిబ్బందిలో మూడింట ఒక వంతు మంది రొటేషన్ పద్ధతిలో విధులకు రావాలని అన్ని డిపార్ట్ మెంట్ల‌కు ఆదేశాలిచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ జోన్ లోకి కాకినాడ