Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం.. చెన్నైలో ఏటీఎంల ధ్వంసం

పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్ల

Advertiesment
Demonetisation
, సోమవారం, 21 నవంబరు 2016 (11:17 IST)
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్లకు పాల్పడుతున్నారు.
 
ముఖ్యంగా.. దేశంలో ఉన్న నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నైలోని ఏటీఎంలు కూడా ఇప్పటికీ తెరుచుకోలేదు. గత 13 రోజులుగా మూసిన షెట్టర్లు మూసినట్టుగానే ఉన్నాయి. దీంతో చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు 3 ఏటీఎంలను ధ్వంసం చేశారు. 
 
మైలాపూర్‌ లజ్‌కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలు ధ్వంసమైవుండడాన్ని ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏటీఎంల కేంద్రంలో సీసీకెమెరాలు పని చేయడం లేదని సమాచారం. ఏటీఎంలో నగదు రాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఈ విధ్వంసానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోర్ - పాట్నా రైలు ప్రమాదం : 133కు పెరిగిన మృతుల సంఖ్య