Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు.. అంతే చంపేసింది.. ఎవరిని?

జైపూరులో ఘోరం జరిగింది. తనకు వారసుడు కావాలని తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు ఓ భర్త. అయితే భర్త వేధింపులు తాళలేక తాళి కట్టిన భార్యే అతనని హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. జైపూరులో మార్చి 25వ త

భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు.. అంతే చంపేసింది.. ఎవరిని?
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (15:39 IST)
జైపూరులో ఘోరం జరిగింది. తనకు వారసుడు కావాలని తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు ఓ భర్త. అయితే భర్త వేధింపులు తాళలేక తాళి కట్టిన భార్యే అతనని హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. జైపూరులో మార్చి 25వ తేదీన ఓ వ్యక్తి హతమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.

భార్య ఫిర్యాదు మేరకు జైపూరుకు వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి హత్యకు గురైన వ్యక్తి భార్య సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
18 ఏళ్ల క్రితం తనకు హత్యకు గురైన వ్యక్తితో పెళ్లైందని నాలుగేళ్ల పాప పుట్టినా చనిపోవడంతో.. తనకు వారసుడు కావాలని పట్టుబట్టాడు. కానీ ఆమెకు సంతానం కలగకపోవడంతో ఆమె తమ్ముడితోనే అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. అలా చేయకుంటే స్నేహితులతో లైంగిక దాడి చేయిస్తానని బెదిరించాడు. ఇంకా తన కంటిముందే తమ్ముడితో శారీరక సంబంధం కలిగివుండాలని రోజు రోజుకీ ఒత్తిడి తేవడంతో ఆ భార్య వేధింపుల్ని భరించలేకపోయింది. దీంతో తన సోదరుడితో కలిసి భర్తను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపిలోకి రేవంత్ రెడ్డి...?