Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ పార్కులో అత్యాచారం: బస్టాండ్‌‍లో దించుతానని క్యాబ్ డ్రైవర్ కారులో ఎక్కించుకుని..?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత రోజు రోజుకీ కరువవుతోంది. రైలు కోసం వేచి వున్న యువతితో మాటలు కలిపాడు. ఆమెను నమ్మించి బస్టాండ్‌లో దింపుతానని కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల

Advertiesment
Delhi rape case
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (14:01 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత రోజు రోజుకీ కరువవుతోంది. రైలు కోసం వేచి వున్న యువతితో మాటలు కలిపాడు. ఆమెను నమ్మించి బస్టాండ్‌లో దింపుతానని కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 11వ తేదీన 23 ఏళ్ల యువతి లూధియానా వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. 12వ తేదీ తెల్లవారుజామున రైలు వస్తుందని తెలియడంతో యువతి వెయిటింగ్ రూమ్‌లో వేచి వుంది. 
 
12వతేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆ యువతి వెయిటింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చింది. ఆమెను చూసిన కారు డ్రైవర్ చున్ను కుమార్.. ఆమెతో మాటలు కలిపాడు. లూధియానా రైలు రద్దు అయినట్లు నమ్మించాడు. తన కారులో సమీపంలో ఉన్న బస్టాండు వద్ద దింపుతానని అక్కడి నుంచి లూధియానా వెళ్లొచ్చని సూచించాడు. 
 
కుమార్ మాటల్ని నమ్మిన ఆ యువతి మోసపోయింది. కారులో ఎక్కిన యువతిని రెడ్‌ ఫోర్ట్‌ వద్ద గోల్డెన్‌ జూబ్లి పార్కుకు తీసుకెళ్లిన కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అదే కారులో ఎక్కించుకుని పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలి పరారైనాడు. ఈ ఘటనపై బాధితురాలి సోదరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో దారుణం : రైలు రాదని నమ్మించి పార్కుకు తీసుకెళ్లి రేప్ చేశాడు...