Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను 35 సార్లు కత్తితో పొడిచాడు.. అడ్డొచ్చిన కొడుకుని కూడా.. ఎందుకంటే..?

అనుమానం పెనుభూతమైంది. తన భార్య పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇక అంతే.. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగుల

Advertiesment
Delhi
, గురువారం, 22 జూన్ 2017 (08:43 IST)
అనుమానం పెనుభూతమైంది. తన భార్య పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇక అంతే.. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌కు చెందిన బినోద్ బిష్ట్‌ అనే వ్యక్తికి భార్య రేఖతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. ఓ కేటరింగ్ సంస్థలో మేనేజరుగా పనిచేసే బినోద్ భార్య ఓ యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. భార్యతో బినోద్ గొడవపడుతున్నపుడు అతని సోదరుడు కూడా అదే ఆవరణలోని మరో ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఆ ఫ్లాట్‌కు బినోద్ బయట నుంచి గడియపెట్టాడు. 
 
ఆపై భార్యను తిడుతూ కత్తి తీసుకొని 35 పోట్లు పొడిచాడు. అంతలో పక్కగదిలో నిద్రపోతున్న బినయ్ కుమారుడు వినీత్ అడ్డుకోబోగా అతన్ని కూడా కత్తితో పొడిచాడు. తీవ్రగాయాల పాలైన తల్లీ, కుమారులను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి మరణించింది. కుమారుడు వినీత్ కోలుకుంటున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేడిన్ ఇండియా రైఫిళ్లనే తిరస్కరించిన ఇండియన్ ఆర్మీ.. అంత దరిద్రంగా రూపొందించారా?