Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో దారుణం : లేచిపోయేందుకు నిరాకరించిన వివాహిత గొంతుకోసిన ప్రియుడు....

Advertiesment
Delhi
, శనివారం, 29 జూన్ 2019 (14:57 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన ప్రేమకు నో చెప్పిందని ఓ శాడిస్టు ఓ వివాహిత గొంతుకోశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని దేవ్‌ లీ ప్రాంతానికి చెందిన పింకీ(24) అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన సన్నీ (26) అనే వివాహిత పరిచయమైంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు పింకీ బ్యూటీ పార్లర్‌లో పనికి వెళుతోంది. 
 
అయితే, గత ఫిబ్రవరి నెల 14వ తేదీన పింకీకి సన్నీ పరిచయమయ్యాడు. ఇదికాస్తా ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు ఢిల్లీ విధుల్లో షికార్లు చేయసాగారు. ఈ విషయం భర్తకు తెలిసి భార్యను మందలించడమేకాకుండా ఇంటిపట్టునే ఉండిపోవాలని ఆదేశించాడు. ఆ తర్వాత దేవ్ లీ ప్రాంతాన్ని వదిలేసి చిరాగ్ ఢిల్లీ ప్రాంతానికి మకాం మార్చాడు. 
 
అయితే పింకీని తనతో కలవకుండా చేయడంతో సన్నీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో భర్త నుంచి వేరుపడాలని, ఇందుకోసం విడాకులు తీసుకోవాలని సన్నీ ఒత్తిడి చేశాడు. దీనికి పింకీ సమ్మతించలేదు. ఈ వివాహేతర సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని చెప్పింది. పైగా, తన వెంటపడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. 
 
దీంతో పగ పెంచుకున్న సన్నీ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నేరుగా ఆమె ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఇద్దరం లేచిపోదాం రా.. అని బలవంతపెట్టాడు. ఇందుకు పింకీ ఒప్పుకోకపోవడంతో జేబులోని కత్తి తీసి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. 
 
అనంతరం పింకీ గొంతు కోసి తనూ గొంతు కోసుకున్నాడు. ఈ అరుపులు విన్న భవన యజమాని రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరిని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పింకీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సన్నీ ఆరోగ్యం విషమంగా ఉందనీ, ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరెంజ్ జెర్సీల్లో 'మెన్ ఇన్ బ్లూ'... ఇంగ్లాండును అదరగొడతారా?