దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా పసి పిల్లలను కూడా వదలడం లేదు. యువకులు, వృద్ధులు బాలికలు, చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మూడేళ్ల పసికూనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని మాయాపురి ఏరియాలో ఉంటున్న మూడేళ్ల చిన్నారిపై పక్కింటి కుర్రాడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికూనపై ఈ దాడికి పాల్పడ్డాడు.
అయితే ఈ విషయాన్ని ఆ చిన్నారి ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.