Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనటే వెళుతున్నా... ఎక్కండి దింపుతా అన్నాడు... నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్

బాగా తెలిసిన వ్యక్తే కదా... అతడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. అలా ఏమరుపాటుగా వున్నందుకు ఐదుగురు కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... తూర్పు ఢిల్లీలో ఓ బీపీఓ సెంటర్లో 28 ఏళ్ల యువతి పనిచేస్తోంది. పని ము

Advertiesment
Delhi Crime
, మంగళవారం, 14 మార్చి 2017 (14:31 IST)
బాగా తెలిసిన వ్యక్తే కదా... అతడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. అలా ఏమరుపాటుగా వున్నందుకు ఐదుగురు కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... తూర్పు ఢిల్లీలో ఓ బీపీఓ సెంటర్లో 28 ఏళ్ల యువతి పనిచేస్తోంది. పని ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఆమె అలా బయటకు కాలు పెట్టగానే తెలిసిన వ్యక్తి కారును డ్రైవ్ చేస్తూ... నేనూ అటే వెళుతున్నాను... ఎక్కండి దింపుతాను అన్నాడు. 
 
బాగా తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి అతడి కారులో ఎక్కగానే లోపల అప్పటికే మరో ఇద్దరు మగాళ్లున్నారు. దాంతో ఆమె మనసు ఏదో కీడు శంకించి కారు దిగబోగా.... వీళ్లు ఇక్కడే పక్కనే దిగిపోతారు.. అంటూ ఆమెను నమ్మించాడు. ఐతే ఆమె అనుకున్న అపాయం జరగనే జరిగింది. ఆమెను ముగ్గురూ బలవంతంగా ఓ అపార్టుమెంటుకు లాక్కెళ్లారు. వారికి మరో ఇద్దరు కామాంధులు తోడయ్యారు. 
 
శనివారం రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహ కోల్పోగానే ఆమెను గదిలోనే బంధించి గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే తిరిగి గదికి రాగానే అప్పటికే స్పృహలోకి వచ్చిన ఆమె, కామాంధులు తలుపులు తీయగానే బాల్కనీలోని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దెబ్బలు తగిలినా తేరుకుని పరుగు పెట్టి సమీపంలో వున్న పోలీస్ స్టేషనులో తనపై జరిగిన దారుణాన్ని ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు మంత్రి పరిటాల సునీత అండ.. ఎందుకు?