Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భీతిగా అవినీతి... శిక్షపడుతుందనే భయం కూడా లేదు : జస్టీస్ అమితవ్ రాయ్

జయలలిత అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు జస్టీస్ అమితవ్ రాయ్ తీర్పు సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేకంగా రాసిన ఏడు పేజీల తీర్పును చ

నిర్భీతిగా అవినీతి... శిక్షపడుతుందనే భయం కూడా లేదు : జస్టీస్ అమితవ్ రాయ్
, బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (08:27 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు జస్టీస్ అమితవ్ రాయ్ తీర్పు సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేకంగా రాసిన ఏడు పేజీల తీర్పును చదువుతూ... అవినీతి అంటురోగం జన జీవనంలో ప్రతి చోటా ప్రబలుతోందన్నారు.
 
'శిక్ష పడుతుందనే భయం కూడాలేని లెక్కలేనితనం పెరిగిపోతోంది. లాభదాయక ప్రతిఫలాలను ఆశిస్తూ... సామాజిక భావజాలంపై పట్టుసాధిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న, ఊపిరాడనివ్వకుండా ప్రాణాలు తీస్తున్న ఈ బహిరంగ అవినీతిని ప్రజా బాహుళ్యం నుంచి తరిమికొట్టేందుకు అన్ని దశల్లో వ్యక్తిగతంగా, సమిష్టిగా జోక్యం చేసుకోవటం అనివార్యం' అని జస్టిస్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. 
 
'అక్రమ మార్గాల ద్వారా సంపద పోగేసుకోవాలనుకునే దురాశపరులు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. సమాజంలో చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోంది' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరుల్లో అపరాధ భావం కూడా కనిపించడంలేదని, శిక్ష పడుతుందనే భయం కానరావటం లేదని తెలిపారు. సమాజంలో ఇలాంటివారిదే పైచేయి అవుతుండటంతో నిజాయితీపరులు దిక్కుతోచని వారవుతున్నారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత ఫొటో మీద ఒట్టు వేశారు సరే... అసలు ఎమ్మెల్యేలు ఎటువైపు!?