Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.500,1000 నోట్ల రద్దు.. రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ: జైట్లీ

రూ.500,1000 నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. నిజాయితీగా సంపాదించిన వారు ఎం

Advertiesment
Currency demonetisation: RBI got 6 months to prepare for this
, బుధవారం, 9 నవంబరు 2016 (12:39 IST)
రూ.500,1000 నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. నిజాయితీగా సంపాదించిన వారు ఎంత డబ్బు అయినా బ్యాంకుల్లో మార్చుకోవచ్చునని తెలిపారు. రూ.500, రూ. 1000 రూపాయలను రద్దు చేయడంతో నిజాయితీపరులకు ఎలాంటి సమస్య లేదన్నారు. నగదు లావాదేవీలు లేని సమాజం రావాలని అరుణ్‌జైట్లీ ఆకాంక్షించారు. ఇంకా పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలంలో మంచి ఫలితాలిస్తుందని జైట్లీ వ్యాఖ్యానించారు. రూ.500,1000 నోట్ల రద్దు నేపథ్యంలో.. రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ వెళ్లిందని తెలిపారు. 
 
కాగా.. దేశంలో అవినీతిని రూపుమాపే క్రమంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం మనుగడలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లు చెల్లవని, ఎవరిదగ్గరైనా రూ.500, రూ.1000 నోట్లు ఉంటే వారు డిసెంబర్ 31 లోగా ఆయా నగదును బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేయాలని ప్రధాని సూచించారు. ఈ ప్రక్రియ అమలులో భాగంగా బుధ, గురువారాల్లో ఏటీఎం సెంటర్లు పనిచేయవని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కుంభస్థలాన్ని కొట్టిన డోనాల్డ్ ట్రంప్...